ద్వాదశ జ్యోతిర్లింగాలు

ద్వాదశ జ్యోతిర్లింగాలు అనగా 12 జ్యోతిర్లింగాలు. ఈ క్రింది జ్యోతిర్లింగ స్త్రోత్రాన్ని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని శ్లోక సారాంశం.

" సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే
వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి "
జ్యోతిర్లింగం ప్రదేశం
1 సోమనాథ జ్యోతిర్లింగం సోమనాథ్, గుజరాత్
2 మల్లికార్జున లింగము శ్రీశైలము, ఆంధ్రప్రదేశ్
3 మహాకాళ లింగం ఉజ్జయిని, మధ్యప్రదేశ్
4 ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు మామలేశ్వరము, మధ్య ప్రదేశ్
5 వైధ్యనాథ లింగం దేవఘర్, జార్ఖండ్
6 భీమశంకర లింగము డాకిని, మహారాష్ట్ర
7 రామనాథ స్వామి లింగము రామేశ్వరము, తమిళనాడు
8 నాగేశ్వర లింగం ద్వారిక, గుజరాత్
9 విశ్వేశ్వర లింగం వారణాశి, ఉత్తరప్రదేశ్
10 త్రయంబకేశ్వర లింగం నాసిక్, మహారాష్ట్ర
11 కేదారేశ్వర లింగము కేదారనాథ్, ఉత్తరప్రదేశ్
12 ఘృష్టీశ్వర లింగం ఘృష్ణేశ్వరం, మహారాష్ట్ర

Related